50 రకాల వంటకాలతో అరుణ్ జైట్లీకి చంద్రబాబు పసందైన విందు
అమరావతి: అమరావతి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు విందు ఇచ్చారు. విజయవాడ గేట్ వే హోటల్కు చేరుకున్న జైట్లీకి చంద్రబాబు పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ విందుకు జైట్లీతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు కంభంపాటి హరిబాబు, కేశినేని నాని తదితరులు హాజరయ్యారు.

ఈ విందులో 50 రకాల వంటకాలతో జైట్లీ కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. వీటిని చంద్రబాబు పసందుగా తయారు చేయించారు. జైట్లీకి ఇష్టమైన బెండి ఆమ్చూర్, ఏపీ స్పెషల్ ఉలవచారు, గోంగూర పచ్చడి, షుగర్ ఫ్రీ జున్ను, పూతరేకులు, బొబ్బట్లు, పీతలకూర, గోంగూర మటన్, అరటి ఆకుల్లో పత్రి ఫిష్, టైగర్స్ ఫ్రాన్స్ వేపుడు, నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, గారెలు, సీమల స్పెషల్ రాగి సంకటి తదితరాలు మెనూలో ఉన్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ అంశాలను అమలులోకి తేవాలని జైట్లీని కోరారు. దీనిని త్వరగా తేవాలన్నారు. ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, జగన్లు హోదా కోసం సభలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications