ఘోర రోడ్డ ప్రమాదం: ఆరుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు

జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు మహిళలు మృతిచెందారు. కొత్తపేట మండలంలోని మోడేకుర్రు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది.

తూర్పుగోదావరి: జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్‌ వద్ద శనివారం తెల్లవారుజామున లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళలే.

అల్లవరానికి చెందిన సుమారు 13 మంది ఆత్రేయపల్లి మండలంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. మార్గ మధ్యంలో ఓ లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు మార్గమధ్యంలో మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

6 killed as tipper rams into auto in AP

మృతులను చీకట్ల నాగమణి(46), పేరాబత్తుల అనంతలక్ష్మి(40), పి.భవాని(25), పులిమి అనంతలక్ష్మి(40), పి.పార్వతి(48), పి.దుర్గ(60)గా గుర్తించారు. రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం కారణంగా అమలాపురం-రావులపాలెం రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+