జెన్ జీ యువత కోసం 'సేనా గళం' కమిటీ : పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా 'సేనా గళం' అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు , కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాలవారితో ఆరోపణలు చేయించాలి అనే బూర్జువా ధోరణిని తోసిరాజంటూ సేనా గళం పని చేయాలని స్పష్టం చేశారు. జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని జనసేనాని నిర్ణయించారు.

⁠రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోందని అన్నారు.

PawanKalyan Forms Sena Galam Committee to Voice Aspirations of Gen Z Youth in Andhra Pradesh

తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారనీ.. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+