ప్రతిజ్ఞ చేసిన సాయిరెడ్డి- రాజీనామా తరువాత ఫస్ట్ ట్వీట్..!!
Vijayasai Reddy: దేశ 76వ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్లో కోలాహలం నెలకొంది. రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాంతో హాజరు కానున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు ఏర్పాటు పూర్తి చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరంగా కొనసాగుతోంది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. రాజ్యంగ విలువలు.. అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టాయని అన్నారు. మన రాజ్యాంగ విలువలు, ఆదర్శాలను పరిరక్షించడానికి మరింత కృషి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అత్యంత శక్తిమంతమైన, సుసంపన్నమైన భారతదేశం కోసం నిరంతరం శ్రమిస్తామని మాటిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర దేశం వర్ధిల్లడానికి మూలాధారం రాజ్యాంగమేనని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ సంవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత గొప్ప గణతంత్ర దేశం నిర్మాణానికి పునాది పడిన రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య విలువలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
Wishing everyone a happy Republic Day.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 26, 2025
Today, we honour our freedom fighters and constitution makers who laid the foundation of our great Republic. Let us pledge to uphold the ideals of our Constitution and work towards building a stronger, inclusive, and prosperous India. Jai…
మన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలను గౌరవించుకునే విలువైన సందర్భమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలు పరిరక్షిస్తానని, అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, బలమైన, సమ్మిళిత, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తానని సాయిరెడ్డి ప్రతిజ్ఞ చేశారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications