పరీక్ష ఫెయిలవుతానేమోనని విద్యార్థి ఆత్మహత్య: కానీ, మంచి మార్కులతో పాస్
కృష్ణా: పదవ తరగతిలో మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతానేమో అనే సందేహంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. తీరా ఫలితాలు చూస్తే అతను మంచి మార్కులతో పాసయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని గొడవర్రు హరిజనవాడలో మంగళవారం చోటు చేసుకుంది.
ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడవర్రుకు చెందిన వెలిసెల వినయ్కుమార్ (16) కంకిపాడులోని సెయింట్ మేరీస్ స్కూల్లో పదవ తరగతి చదివి పరీక్షలు రాశాడు.

ఈ క్రమంలో మంగళవారం 11గంటలకు ఫలితాలు రావల్సి ఉండగా, తనకు మార్కులు తక్కువ వస్తాయేమోని, లేక ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సుమారు ఉదయం 10గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. విగతజీవిగా పడివున్న వినయ్ కుమార్ను చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్మార్టం నిమిత్తం వినయ్ మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వినయ్ పదో తరగతిలో పాసవ్వడమే కాకుండా మంచి మార్కులతో పదికి 9 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications