పరీక్ష ఫెయిలవుతానేమోనని విద్యార్థి ఆత్మహత్య: కానీ, మంచి మార్కులతో పాస్
కృష్ణా: పదవ తరగతిలో మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతానేమో అనే సందేహంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. తీరా ఫలితాలు చూస్తే అతను మంచి మార్కులతో పాసయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని గొడవర్రు హరిజనవాడలో మంగళవారం చోటు చేసుకుంది.
ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడవర్రుకు చెందిన వెలిసెల వినయ్కుమార్ (16) కంకిపాడులోని సెయింట్ మేరీస్ స్కూల్లో పదవ తరగతి చదివి పరీక్షలు రాశాడు.

ఈ క్రమంలో మంగళవారం 11గంటలకు ఫలితాలు రావల్సి ఉండగా, తనకు మార్కులు తక్కువ వస్తాయేమోని, లేక ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సుమారు ఉదయం 10గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తిరిగి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. విగతజీవిగా పడివున్న వినయ్ కుమార్ను చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్మార్టం నిమిత్తం వినయ్ మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వినయ్ పదో తరగతిలో పాసవ్వడమే కాకుండా మంచి మార్కులతో పదికి 9 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications