విద్యార్థినిపై లైంగిక వేధింపులు: టీచర్కి స్త్రీల దేహశుద్ధి
ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఉపాధ్యాయుడు సింహాచలాన్ని చితకబాదారు. అనంతరం అతన్ని విశాఖపట్నంలోని ఐదో పట్టణ పోలీస్స్టేషన్లో అప్పగించారు.
సుమోను ఢీకొన్న రైలు: ఐదుగురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వాయల్పాడు మండలం ఇట్లంవారిపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ సుమోను గుంతకల్లు ప్యాసింజర్ రైలు ఢీకొంది. సుమో రైలు పట్టాలు దాతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
మృతులు గుర్రంకొండ మండలం రామాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కాగా రైల్వే కాపలా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. మరో ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా లేవేరు మండలం బుడుమూరు కూడలి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.