Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ ఎంపీటీసీ కిడ్నాప్, హత్య?, గుండెపోటు డ్రామాలతో ఆ కంపెనీ?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కిడ్నాప్ కు గురికావడమే కాకుండా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగుల చేతిలో హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మీద ఆరోపణలు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

గంగాధర నెల్లూరు సమీపంలోని పాలసముద్రం మండలం నరసింహాపురంలో జగన్నాథరాజు నివాసం ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అయిన జగన్నాథరాజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్న జగన్నాథరాజు సొంతంగా ట్రాక్టర్లు, జేసీబీలు పెట్టుకుని వాటిని అద్దెకు ఇస్తున్నాడు. జేసీబీలు కొనుగోలు చేయడానికి ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో జగన్నాథరాజు అప్పు తీసుకున్నాడు.

A Telugudesam Party leader in Andhra Pradesh has died under suspicious circumstances

ఆ డబ్బుతో జగన్నాథరాజు జేసీబీ కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జగన్నాథరాజు సకాలంలో ఫైనాన్స్ సంస్థకు కంతులు చెల్లించలేకపోయాడు. జగన్నాథరాజు చిత్తూరులో కొన్ని కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నాడు. ఏలూరు జిల్లా నూజువీడుకు చెందిన ఆ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పదిమంది రెండు కార్లలో జగన్నాథరాజు నివాసం ఉంటున్న గ్రామానికి వెళ్లారు.

ఆ తర్వాత జగన్నాథరాజు ఎక్కడ ఉన్నాడంటూ గ్రామస్తులను అడిగారు. జగన్నాథరాజు చిత్తూరులో ఉన్నాడని గ్రామస్తులు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి చిత్తూరులో పని ముగించుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జగన్నాథరాజు అతని జేసీబీ డ్రైవర్ శంకర్ కలిసి బైక్ లో గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకుడు జగన్నాథరాజును కిడ్నాప్ చేశారు.

ఆ తర్వాత జేసీబీ డ్రైవర్ శంకర్ జగన్నాథరాజు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. కొన్ని గంటల తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు జగన్నాథ రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. జగన్నాథరాజు గుండెపోటుతో చనిపోయాడని సమాచారం ఇచ్చారు. రుణం సకాలంలో చెల్లించలేదని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులే జగన్నాథరాజును కొట్టి చంపేశారని, ఆయనకు గుండెపోటు లేదని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జీడి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అనుమానస్పద స్థితిలో చనిపోవడంతో పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+