బాలికకు ఇంటే ముందే తాళికట్టిన యువకుకడు.. అభ్యంతరం చెప్పని తల్లిదండ్రులు..
ఓ యువకుడు మైనర్ బాలికకు పసుపుతాడు కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండ మండలంలోని అమిత్యాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీకాంత్ అనే యువకుడు బాలికకు మాయమాటలు చెప్పాడు.
పంచాయితీ
ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. శ్రీకాంత్ మాటలు నమ్మిన బాలిక అతడితో ప్రేమలో పడింది. యువకుడు బాలికతో తిరుగుతుండడం చేసిన కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అయినా వారి తీరు మారకపోవడంతో 18న గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు.పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ పెట్టారు.
పసుపుతాడు
పంచాయతీ పెద్దలు బాలిక ఇంటి ముందు యువకుడి చేత తూతూ మంత్రంగా పసుపుతాడు కట్టించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు స్పందించారు.
తిరుపాల్భాయి
ఉరవకొండ రూరల్ సూపర్వైజర్ తిరుపాల్భాయి ఆమిద్యాలకు వెళ్లి బాలికను విచారించారు. బాలికను చైల్డ్ హోంకు తరలిస్తామని చెప్పారు. బాల్యవివాహలు చట్టరీత్యా నేరమని, 8వతరగతి చదివే బాలిక పెళ్లి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. బాలికలను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్ అయ్యే వరకూ చదివిస్తామని తెలిపారు. యువకుడితో పాటు అందుకు ప్రోత్సహించిన గ్రామపెద్దలను పోలీసు స్టేషన్కు పిలిపించినట్లు సమాచారం.