ఏ-1గా మాజీ మహిళా మంత్రి, బిగిస్తున్న ఉచ్చు- రంగం సిద్దం..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ హయాంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడిన వారి పైన కేసులు నమెదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు జైలుకు వెళ్లారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రి కు ఉచ్చు బిగిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూల్లకు పాల్పడ్డారనే ఫిర్యాదుల పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితో పాటుగా ఐపీఎస్ అధికారి పైనా విచారణకు రంగం సిద్దమైంది. దీంతో, ఈ మాజీ మహిళా మంత్రి వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
మాజీ మంత్రి పై కేసు
మాజీ మంత్రి విడదల రజనీ పై ఏసీబీ కేసు నమోదైంది. మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు.

రజనీ పేరుతో బెదిరింపులు
రజనీ తో పాటుగా జాషువా మరి కొందరు బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందింది. దీని పైన విచారణ చేసిన అధికారులు ప్రభుత్వానికి నివే దిక సమర్పించారు. విజిలెన్స్ సిఫార్సు మేరకు సర్కార్ ఏసీబీ విచారణకు ఆదేశించింది. ప్రాధమి క ఆధారాలు లభించడంతో తాజా కేసు నమోదు చేశారు. కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పినట్లు ఫిర్యాదు చేసారు.
కీలక ఆధారాలు
ఆ స్టోన్ క్రషర్పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విజిలెన్స్ లో కీలకంగా వ్యవహరించిన జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. అప్పట్లో ఈ సోదాల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని ఆ తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలాలిచ్చారు. తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని లేకపోతే రూ.50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో, వారు రూ.2 కోట్లు ఇచ్చారు. ఇక, ఇప్పుడు ప్రాధమికంగా ఆధారాలు ఉండటంతో.. ఈ కేసులో రజనీ తో పాటుగా మిగిలిన వారిని విచారించేందుకు రంగం సిద్దమైంది. ఏసీబీ తీసుకునే చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications