చిట్టా లాగుతున్నారు: ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కినట్లేనా?, ఏక కాలంలో 18 చోట్ల..
విజయవాడ: ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కినట్లే కనిపిస్తోంది. ఏపీ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆయన ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు సోదాలు చేపట్టారు.

బంధువుల ఇళ్లలోను:
ప్రస్తుతం రాజమహేంద్రవరంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ కు పలు చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. రాజమహేంద్రవరంతో పాటు విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురంలలోని బంధువుల, స్నేహితుల ఇళ్లపై కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రానికల్లా అక్రమాస్తుల వివరాలు బయటకొచ్చే అవకాశముంది.

ఏక కాలంలో 18 చోట్ల
తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్జేసీ కార్యాలయాన్ని చంద్రశేఖర్ ఆజాద్ తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

బినామీ పేర్లతో:
ఏలూరు పత్తేబాద్ సమీపంలో 6 ఎకరాల విలువైన స్థలాన్ని చంద్రశేఖర్ ఆజాద్ బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే విజయవాడ పడమట సమీపంలోని విద్యుత్ కోట్లు విలువ చేసే ఐదు అంతస్తుల భవనాన్ని గుర్తించారు. ఇది కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడ ఆస్తులు:
గొల్లపూడిలో అత్యాధునిక హంగులతో ఓ ఇంటిని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.1.50కోట్ల పైచిలుకే అని భావిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న ఈ ఇంటి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా కదిరిలోను 32ఎకరాల్లో అబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై రూ.15కోట్ల రుణం తీసుకున్నట్లు, ఇది ఆజాద్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications