వోల్వో ప్రమాదం: కెమికల్స్ వొట్టిదే, కల్వర్ట్ పైపు వల్లే
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల జరగిన జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాద ఘటనపై విచారణ మంగళవారం పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు.
జబ్బార్ ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30వన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు మంగళవారం వరకూ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా క్లూస్ టీమ్ మహబూబ్నగర్ ఎస్పీకి ఓ నివేదికను సమర్పించారు.

బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టిందని, కల్వర్టు పైపు డీజిల్ ట్యాంక్లోకి చొచ్చుకుపోవడం వల్ల మంటలు చెలరేగాయని క్లూస్ టీమ్ తన నివేదికలో తెలిపింది. మంటలు లగేజీ విభాగానికి తాకడంతో ప్రమాదం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. బస్సులో రసాయనాలు గానీ, పేలుడు పదార్థాలు గానీ లేవని క్లూస్ టీమ్ తేల్చింది.
కాగా, ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో మరణించినవారి 34 మందిని గుర్తించారు. గుర్తు పట్టలేకుండా కాలిపోవడంతో డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి, మృతులను గుర్తిస్తున్నారు. బస్సులో రసాయనాలు ఉండి ఉండవచ్చునని మంగళవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను క్లూస్ టీమ్ కొట్టిపారేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications