విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో రాష్ట్ర రాజధాని నుంచి కాదు, విజయవాడ నుంచే పాలన సాగాలి: హరిబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి హరిబాబు అన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉందని, ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం విజయవాడలో బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు.

Administration should continue from Vijayawaday, says Haribabu

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు.

అదేవిధంగా రాష్ట్ర బిజెపికి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ అంశంపై కూడా నేతలు చర్చించనున్నారు.

English summary
Andhra Pradesh BJP president and MP Haribabu on Saturday said that AP administration should continue from Vijayawaday, not from Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X