అమ్మానాన్న చనిపోతే మంత్రినయ్యా.. ఇలాంటి దారుణ పరిస్థితి మరెవరికీ వద్దు: అఖిలప్రియ
అమ్మ శోభ, నాన్న నాగిరెడ్డి చనిపోతే తాను మంత్రిని అయ్యానని, ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవరికీ రావద్దని భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు: కర్నూలులో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత మహానాడులో నాన్న తన చేయి పట్టుకుని నడిపించారని, ఇప్పుడు కార్యకర్తలు నడిపిస్తున్నారని అన్నారు.
భూమా ఫ్యామిలీతో పోటీ, సర్వేతో టిక్కెట్: శిల్పా, నారాయణరెడ్డి హత్యపై..
అమ్మ శోభ, నాన్న నాగిరెడ్డి చనిపోతే తాను మంత్రిని అయ్యానని, ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవరికీ రావద్దని భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాయలసీమలో కరువును పోగొట్టేందుకు కృషి చేసిన బుడ్డా వెంగళరెడ్డిల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే, భూమానాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఉపఎన్నిక సీటు కోసం ఇటు అఖిల ప్రియ కుటుంబం అటు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఉపఎన్నిక అభ్యర్థిపై తుది నిర్ణయం అధినేతదే కావడంతో.. ఆయన నిర్ణయం కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి.