స్వరాజ్యం ఫైర్: రేపిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేపిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం, ఇతర నేతలు పాల్గొని అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇటీవల మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. మరో ఘటనలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పహాడీషరిఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇలాంటి ఘటనలు నగరంలో రోజు రోజుకు పెరుగుతుండటంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు.
ఆందోళన
నగరంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రేపిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆందోళన
ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం, ఇతర నేతలు పాల్గొని అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళన
ఆందోళనలో రేపిస్టుల దిష్టిబొమ్మకు నిప్పంటి కాలుతో తన్నుతున్న ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్యం.
ఆందోళన
అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఐద్వా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.