ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నేడే..!! ఏ సర్వీసుపై ఎంత మేర - వైసీపీ హాయంలో రెండో సారి..!!
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమైంది. ఆర్జీసీ యాజమాన్యం పెరిగిన ధరలను ఈ రోజు అధికారికంగా ప్రకటించనుంది. పెరిగిన డీజీల్ ధరలు..నిర్వహణా భారంతో ఛార్జీలు పెంచక తప్పదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రాయితీలు భరించే అవకాశం లేకపోవటంతో..ఛార్జీల పెంపు తప్పదని నిర్ణయించారు. కరోనా సమయంలోనే ఆర్టీసీ భారీగా నష్టాలను ఎదుర్కొంది. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న అప్పులు..వడ్డీల చెల్లింపు..నిర్వహణ ఖర్చులతో పాటుగా నష్టాల అంశం పైన అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు.
దీంతో..పల్లెవెలుగు బస్సు నుంచి ఏసీ బస్సు వరకు అన్నింటి పైనా ఛార్జీల భారం వేయక తప్పదని నిర్ణయించారు. అన్ని సర్వీసుల పైన దాదాపు 20 -25 శాతం మేర పెంపుకు అధికారులు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. పెరిగిన ఛార్జీలను వెంటనే అమలు చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆర్టీసీ ఛైర్మన్..ఎండీ పెరిగిన ఛార్జీల వివరాలను ప్రకటించనున్నారు. 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ ఛార్జీల పెంపు ఇది రెండో సారి. 2019 డిసెంబర్ లో అన్ని రకాల సర్వీసుల పైన ఛార్జీలు పెంచారు. అప్పట్లోనూ డీజీల్ ఛార్జీలతో పాటుగా కొన్ని సర్వీసుల కారణంగా ఏర్పడుతున్న నష్టాలు..రుణ భారం..కడుతున్న వడ్డీలతో పాటుగా మోటారు వాహన పన్ను వంటి వాటి కారణంగా ఛార్జీలు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.

పల్లె వెలుగు సర్వీసుల్లో కనీస ఛార్జ్ రూ 5 ఉండగా..దానిని రెట్టింపు చేయాలని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే పల్లె వెలుగ పైన భారం తగ్గించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..దీని పైన కొంత మేర భారం పడే అవకాశం ఉంది. అదే విధంగా.. ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉన్న కనీస చార్జీ రూ.15 నుంచి రూ.20కి పెరగనుంది. సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ కనీస ధర రూ.45. ఇది... రూ.60కి చేరే అవకాశముంది. ఏసీ బస్సులో కనీస టికెట్ ధర రూ.వంద రూపాయాల వరకు పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పెరిగిన ధరల పైన ఆర్జీసీ యాజమాన్యం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications