Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు, ఎవరికి ఏ టైం - ప్రముఖుల లిస్టులో..!!

Tirumala: వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలుకానున్నాయి. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ సహా పలువురు ప్రముఖులు తిరుమల చేరుకుంటున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు 7.70 లక్షల మందికి దర్శనం చేయించేలా టీటీడీ ప్రణాళికలు అమలు చేస్తోంది. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేస్తారు.

all-set-for-vaikunta-dwara-darshan-at-the-tirumala-temple-from-december-30

1.30కు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రారంభిస్తారు. ఉదయం 5.30కు ఆన్‌లైన్‌లో టోకెన్‌ పొందిన భక్తులను అనుమతిస్తారు తొలి మూడురోజులు డిప్‌ ద్వారా టోకెన్ల పొందినవారికే దర్శనం ఉంటుంది. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం(టోకెన్‌ రహిత), రూ.300 దర్శనం, శ్రీవాణి, ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాలు జరగనున్నాయి.

కాగా, మంగళవారం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేసేందుకు ఇప్పటికే పెద్దసంఖ్యలో వీఐపీలు లేఖలు పంపారు. ఈ క్రమంలో నారాయణగిరి-4లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏపీ విప్‌, కార్పొరేషన్‌ చైర్మన్లకు, వెంకటకళ విశ్రాంతి భవనంలోని కౌంటర్‌లో గవర్నర్‌, సీఎం, న్యాయమూర్తులు, మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, అధికారులకు దర్శన టికెట్లు, గదులను సోమవారం ఉదయం నుంచి కేటాయించనున్నారు. ఇక.. కుటుంబ సమేతంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దర్శించుకోనున్నారు.

అందుకోసం సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకోన్నారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శానసమండలి చైర్మన్ మోషెస్ రాజు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు.. దాదాపు 80 మందికిపైగా ప్రముఖులు తిరుమల వస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులకు సమాచారం అందింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+