'ఓటుకు నోటులో చంద్రబాబుపై పూర్తి ఆధారాలు': సుప్రీం కోర్టులో ఇలా..
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది సుధాకర్ శుక్రవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేలతో ఈ కేసు దర్యాఫ్తును ఆపాలని చూశారని చెప్పారు.
అయితే నాలుగు వారాలలోగా ఓటుకు నోటు కేసును పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. నాలుగు వారాలు దాటితే తిరిగి తమ వద్దకు రావొచ్చునని చెప్పిందని అన్నారు.
సుప్రీం కోర్టులో వాదనలు ఇలా...
ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టులో వాదనలు వాడిగా వేడిగా జరిగాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఆళ్ల తరఫున శేఖర్ నాప్డే వాదనలు వినిపించారు.

ప్రాథమిక వాదనలు ముగియగానే స్టే అండ్ నోటీసు ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. కేసు దర్యాఫ్తు జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టే పైన తొలుత కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఉత్తర్వులు ఇవ్వగానే బాబు లాయర్ మళ్లీ వాదనలు వినిపించారు.
ఏపీ సీఎంపై రాజకీయ దురుద్దేశ్యాలతో కేసు పెట్టారని లూథ్రా పేర్కొన్నారు. ఒక ఎఫ్ఐఆర్లో దర్యాఫ్తు సాగుతుండగా మరో ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారన్నారు. ఏసీబీ కోర్టు సెక్షన్ 156, 210 కింద ఆదేశాలు ఇచ్చిందని, ఆ కోర్టు ఆదేశాల పైన తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు.
ఆ సమయంలో లూథ్రాను సుప్రీం జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారన్నారు. వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. దాంతో దర్యాఫ్తు పై హైకోర్టు 8 వారాల స్టే ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే మూడు వారాలు పూర్తయిందన్నారు.
అందువల్ల హైకోర్టులోనే కేసు కొనసాగించమని చెప్పాలని ఆయన కోరగా, ఆయన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. నాలుగు వారాల్లోగా ఈ కేసును పరిష్కరించాల్సిందిగా హైకోర్టును ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆ సమయంలో ఏసీబీ, ఏపీ సీఎం అంటూ చంద్రబాబు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల తరఫు న్యాయవాది శేఖర్ వాదన ప్రారంభించారు. ఒక కేసు దర్యాఫ్తును ఆపమని చెప్పడం సబబు కాదని, అవినీతి కేసులో స్టేకు వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఛార్జీషీటులో చంద్రబాబు పాత్ర లేనందువల్లే మళ్లీ దర్యాఫ్తు కోరామన్నారు.
చంద్రబాబు పాత్రను పరోక్షంగా ప్రస్తావించారని, ఆయన విషయంలో దర్యాఫ్తుపై మెతక వైఖరితో ఉన్నారని తెలిపారు. ప్రజా జీవితంలో నైతికత, నిబద్ధత అత్యంత ఆవశ్యమన్నారు. హైకోర్టులో అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. నాలుగు వారాల్లో హైకోర్టు పరిష్కరించకుంటే ఎలా అన్నారు. దానికి ధఱ్మాసనం కచ్చితంగా నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications