14న నోటిఫికేషన్: నవంబర్ 8న ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అక్టోబర్ 14 నోటిఫికేషన్ జారీ కానుంది. అక్టోబర్ 14న నోటిఫికేషన్, నవంబర్ 8న ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక నిర్వహించనున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
12వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది.అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని, 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పుడు జరిగిన ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఆళ్లగడ్డకు జరనున్న ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications