అల్లు అర్జున్ అరెస్ట్.. చంద్రబాబును లాగుతూ కేఏ పాల్ సంచలనం
ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం తనకు వచ్చిన హక్కుతో కోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారని అల్లు అర్జన్ను అరెస్టు చేశారు సరే.. ప్రస్తుతం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీలు నిర్వహించినప్పుడు ఎంతో మంది చనిపోయారని.. అప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కేఏ పాల్ ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తే 8 మంది చనిపోయారని కేఏ పాల్ తెలిపారు. గుంటూరులో ముగ్గురు చనిపోయారని.. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు స్టంట్ చేసినప్పుడు తొక్కిసలాట జరిగి 23 ంది చనిపోయారని కేఏ పాల్ గుర్తు చేశారు.
Allu Arjun Arrest Updates :
— Pulse News (@PulseNewsTelugu) December 13, 2024
Dr K A Paul’s strong counter about Allu RJÛÑ arrest#AlluArjun #AlluArjunArrest #Pushpa2TheRule pic.twitter.com/WLTP8j6SGt
అయితే, అప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? ఆయన్ను స్టేషన్కు తీసుకొచ్చారా? ఆయన్ను విచారించారా? అని కేఏ పాల్ నిలదీశారు. పవర్ పొలిటికల్ లీడర్ల విషయంలో ఒకలా.. సాధారణ ప్రజలు, నటుల విషయంలో మరోలా వ్యవహరిస్తారా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications