అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ సాగుతోంది. ఆమంచి వైసీపీలోకి లేదా జనసేనలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.

చంద్రబాబును కలవలేదు
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. మంత్రి శిద్ధాను ఆయన వద్దకు పంపించారు. కానీ ఆమంచి తగ్గలేదు. తనకు టీడీపీలో అన్యాయం జరుగుతోందని చెప్పారు. తనను కలవాలని చంద్రబాబు చెప్పారు. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం టీడీపీ అధినేతను కలుస్తారని భావించారు. కానీ ఆయన కలవలేదు.

రామచంద్రాపురంలో ఆమంచి ప్రత్యక్షం
అదే సమయంలో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమంచి రాత్రి వరకు చంద్రబాబు వద్దకు చేరుకోలేదు. చంద్రబాబు కడప, కర్నూలు జిల్లా నేతలతో బిజీగా ఉండటం వల్లే కలవలేదని తెలుస్తోంది. నేడు లేదా రేపు చంద్రబాబును కలవవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఆమంచి రామచంద్రాపురంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రామచంద్రాపురంలో పార్టీకి చెందిన తోట త్రిమూర్తులును కలిశారు. అయితే తోట కూడా తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఆమంచి, తోట జనసేనవైపా, వైసీపీ వైపా
ఈ నేపథ్యంలో తోట, ఆమంచిలు కలుసుకోవడం గమనార్హం. అంతేకాదు, వారు రామచంద్రాపురంలో పలువురు కాపు నేతలతోను భేటీ అయ్యారని తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్తు పైన చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. తోట, ఆమంచి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారు ఇద్దరు కలిసి వైసీపీలో చేరుతారా లేక తమ తమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందనే అభిప్రాయంతో వారు జనసేన వైపు చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications