అమరావతిలో సీజేఐ ఎన్వీ రమణ - రైతుల పూల వర్షం : తానేమీ హీరోను కాదంటూ ఛలోక్తులు..!!
అమరావతిలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు అపూర్వ స్వాగతం లభించింది. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా అమరావతికి వచ్చారు. మూడు రోజుల ఏపీ పర్యటన లో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ నాగార్జున యూనవర్సిటీలో జరిగిన ఏపీ న్యాయాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన అమరావతి బయల్దేరారు. నేలపాడులోని హైకోర్టులో బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సీజేఐ కు సన్మానం జరిగింది.

అమరావతి గ్రామాల్లో పూలవర్షం
నాగార్జున యూనివర్సిటీ నుంచి హైకోర్టుకు వెళ్లే మధ్యలో అమరావతి గ్రామాల్లో సీజేఐకు అమరావతి ఐకాస రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. జాతీయ జెండాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. సీజేఐ కు నమస్కరిస్తూ.. పూలు జల్లుతూ.. రైతు కండువాలు ధరించి సీజేఐకు స్వాగతం పలికారు. వారి ఆహ్వానానికి..అభిమానానికి ప్రతిగా సీజేణ తన కారులోనే నిలబడి వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. గతంలో 2015లో అమరావతి నగర శంకుస్థాపన సమయంలో ప్రధానితో పాటుగా జస్టిస్ ఎన్వీ రమణ సైతం పాల్గొన్నారు.

హైకోర్టులో ఘన స్వాగతం
ఆ తరువాత హైకోర్టు భవనం ప్రాంభోవత్సం సమయంలోనూ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి సారి ఆయన అమరావతికి రావటంతో రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక, హైకోర్టులో సీజేఐ కు హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన సన్మానం చేసారు. హైకోర్టు న్యాయమూర్తులు..అధికారులు..సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ ఛలోక్తులు విసిరారు. తనతో ఫొటోలు దిగటానికి..శాలువాలు కప్పటానికి తొందర పడవద్దని సూచించారు.

హీరోను కాదంటూ ఛలోక్తులు
మూడు రోజుల పర్యటనలో కార్యక్రమాలకు హాజరై.. లనేక ప్రసంగాలు చేసానని చెప్పారు. ఇక తాను ఉండలేనంటూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైదరాబాద్ వెళ్లిపోయారని..ఇక, మిగిలిన వారు కూడా వెళ్లకముందే కార్యక్రమం ముగిద్దామని సూచించారు. తాను సినిమా హీరోను కాదని..మీ వాడిని..అందరికీ తెలిసిన వాడినేని చెప్పారు. ఇక, ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీలు ఉన్నాయని..తాను ఏపీ సీజే కు పేర్లు పంపాలంటూ లేఖలు రాసానని వెల్లడించారు. త్వరలోనే ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. మరి కాపేసట్లో సీజేఐ రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు హాజరు కానున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!












Click it and Unblock the Notifications