తెరమీదకు అమరావతి భూ కుంభకోణం .. లోకేష్ తో పాటు ఆ టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుందా ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల కుంభకోణం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏపీ సిఐడికి భూముల అక్రమాలపై విచారణ బాధ్యతను అప్పగించింది. అప్పటినుండి అమరావతి భూముల అక్రమాల తీగ లాగుతున్న సీఐడీ అధికారులు తాజాగా ఈ వ్యవహారంలో టిడిపి అధినేత, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే నాడు మంత్రిగా వ్యవహరించిన నారాయణకు నోటీసులు ఇవ్వడం ఏపీలో దుమారంగా మారింది. దీంతో చంద్రబాబు తో పాటుగా లోకేష్ మరికొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించిన నేపథ్యంలో వారి మెడకు కూడా రాజధాని భూముల అక్రమాలపై ఉచ్చు బిగుస్తుందా అన్న చర్చ సాగుతుంది.

రాజధాని భూముల అక్రమాలలో నాడు టీడీపీ మంత్రులు , నేతల పేర్లు
అమరావతి భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం విచారణ జరిపి అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా తేల్చిన విషయం తెలిసిందే. అమరావతి భూముల అక్రమాలతో సంబంధమున్న నేతల జాబితాను కూడా నాడు మంత్రివర్గ ఉప సంఘం సమర్పించింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకే సిఐడి కేసులు నమోదు చేసింది . ముఖ్యంగా చంద్రబాబు, నారాయణలతో పాటుగా లోకేష్ ,పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పత్తిపాటి పుల్లారావు, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేష్ , ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, వేమూరు రవికుమార్ ప్రసాద్, కంభంపాటి రామ్మోహన్, లంకా దినకర్ తదితరుల పేర్లను అక్రమాలకు పాల్పడిన జాబితాలో చేర్చింది మంత్రివర్గ ఉప సంఘం.

రంగంలోకి దిగిన సిఐడీ అధికారులు ..పలువురిపై కేసుల నమోదు
రాజధాని ప్రాంతంలో అక్రమాలకు పాల్పడి, టిడిపి నేతలకు వారి బినామీలకు లబ్ధి చేకూర్చిన్నట్లు ప్రధానంగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు.
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, అమరావతి భూముల అక్రమాలపై విచారణ జరపడం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికతో ఏపీ ప్రభుత్వం ఏపీ సి ఐ డి విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వ్యవహారంలో ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ సి ఐ డి విభాగం అక్కడ భూములు కొనుగోలు చేసిన కొందరిపై కేసులు నమోదు చేసింది.

సిఐడీ కేసులకు కోర్టులో సవాల్ .. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టేసిన కోర్టు
అప్పటి టిడిపి ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల రాజధాని ఏ ప్రాంతం లో వస్తుందో ముందుగా తెలుసుకొని ఆ ప్రాంతంలో రాజధాని అధికారిక ప్రకటన రాకముందే అక్కడ భూములు కొన్నారని కొందరు టిడిపికి సన్నిహితంగా ఉన్న వారిపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం ఆ తర్వాత కోర్టు సిఐడి అధికారులు చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అది ఏపీ సి ఐ డి నమోదుచేసిన సెక్షన్ల కిందకు రాదని కోర్టు కొట్టేసింది.

లోకేష్ తో పాటు ఆ నేతల మెడకు ఉచ్చు బిగుస్తుందా ?
అయినప్పటికీ మరోమారు సర్కార్ రాజధాని భూముల అక్రమాలను విడిచిపెట్టేది లేదని తేల్చింది . మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుండి టీడీపీ ఇంకా కోలుకోకముందే మరోసారి రాజధాని భూముల అక్రమాల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. చంద్రబాబు నాయుడు, నారాయణకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు రాజధానిలో భూ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న లోకేష్, పత్తిపాటి పుల్లారావు, పరిటాల శ్రీరామ్, పయ్యావుల కేశవ్ తదితరులకు కూడా ఏపీ సిఐడి ఉచ్చు బిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications