వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ అదేం లేదంటే..! అమిత్ షా మాత్రం చర్చలంటున్నారు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మిత్రపక్షాల మధ్య రాజ్యసభ సీట్ల సర్దుబాటు రసవత్తరంగా మారుతోంది. ఇరుపక్ష నేతల భిన్నాభిప్రాయాలు చూస్తోంటే, ఈ విషయంలో ఏకాభిప్రాయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజ్యసభ సీటు ప్రతిపాదనను టీడీపీ ముందుంచామని బీజేపీ చెప్తుంటే, అసలు ఆ విషయంపై ఇంతవరకు బీజేపీ తమని సంప్రదించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం ఉదయం ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభ సీటు గురించి టీడీపీ సంప్రదింపులు జరుపుతున్నాయని ప్రకటించడం చర్చలకు తావిచ్చింది. రాజ్యసభ సీట్ల సర్ధుబాటు కోసం ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు అమిత్ షా. అలాగే ఏపీ బీజేపీ శాఖకు వచ్చే వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.

amit shah comments are not matching with lokesh

ఇదిలా ఉంటే మహానాడుకు బయలుదేరే రెండు రోజుల ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడిన లోకేష్ రాజ్యసభ సీట్ల విషయమై బీజేపీ ఇప్పటిదాకా తమని సంప్రదించలేదని ప్రకటన చేయడం గమనార్హం.

English summary
Bjp leader amit shah made an announcement that the party is discussing with tdp over rajyasabha seats issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X