ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం: జాప్యం చేయకుండా మూడు రాజధానుల బిల్లు..!!
అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశ పర్చాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీ తరువాత ఏ రోజైనా అసెంబ్లీ భేటీ అవ్వొచ్చని సమాచారం. ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేలా అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తుంది.
Recommended Video
అంతకంటే ముందు- ఏపీ మంత్రివర్గం సమావేశమౌతుంది. ఈ నెల 7వ తేదీన వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం షెడ్యూల్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ భేటీలో ఖారరవుతుంది. దీనితోపాటు- సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై ఇందులో చర్చిస్తారు. ప్రత్యేకించి- మూడు రాజధానుల బిల్లు విషయంలో ఇక జాప్యం చెయ్యకూడదని, ఈ భేటీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

నిజానికి- ఏపీ మంత్రివర్గం కిందటి నెల 29వ తేదీ నాడే సమావేశం కావాల్సి ఉంది. అది ఇవ్వాళ్టికి వాయిదా పడింది. వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రెండోసారి కూడా ఈ భేటీని వాయిదా వేశారు. సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించాల్సి ఉన్నందున- ఈ నిర్ణయం తీసుకున్నారు.
7వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ భేటీలో వర్షాకాల సమావేశాల తేదీని ఖరారు చేస్తారు. ఈ నెల 20వ తేదీ తరువాత నిర్వహించేలా ప్రాథమిక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇదివరకు మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మరింత మెరుగైన బిల్లుతో వస్తామంటూ వైఎస్ జగన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తరువాత ఇప్పటివరకు అది చర్చకు రాలేదు.
కాగా- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణను ఈ వర్షాకాల సమావేశాల కోసం కూడా కొనసాగిస్తారా? లేక సభకు హాజరవుతారా? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సభకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications