బోటు ఆపరేటర్ల తో సచివాలయంలో సమావేశం, బోటు ప్రమాదంపై సీరియస్గా ఉన్నాం
ఇబ్రహీం పట్నం ఫెర్రీ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని రాష్ట్రం లోని బోటు ఆపారేటర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా నేడు టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఎ
అమరావతి: ఇబ్రహీం పట్నం ఫెర్రీ వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని రాష్ట్రం లోని బోటు ఆపారేటర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ సందర్భంగా నేడు టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కే. మీనాతో సమావేశం జరిగింది.
Recommended Video

ఫెర్రి ప్రమాద ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామని అన్నారు. ఘటనపై శాఖాపరమైన విచారణ ప్రారంభించామని పర్యాటక శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి గేదెల శ్రీను ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్దారించినట్లు ఆయన తెలిపారు.

గేదేల శ్రీను పై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించాం అని చెప్పారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా మంగళవారం రాష్ట్రం లోని బోట్ ఆపరేటర్ లతో సచివాలయం లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బోట్ ల నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్త లపై ఆదేశాలు ఇస్తాం అని ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో బోట్లు పరిస్థితి ఎలా ఉంది వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించి కఠినం గా వ్యవహరించ నున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications