అమరావతిలో లక్ష కోట్ల సంపద: రాజధాని రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు: చలసాని శ్రీనివాస్..!
గుంటూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలను కొనసాగిస్తోన్న అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళన 13వ రోజుకు చేరుకోవడం, ఆరుమంది రైతులు అరెస్టు కావడం, రోజురోజుకూ ఉధృతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చలసాని శ్రీనివాస్.. వారికి తన మద్దతును ప్రకటించారు. స్వయంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోని పెదపరిమిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయన బైఠాయించారు.

లక్ష కోట్లకు పైగా సంపద..!
అమరావతిలో గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపదను సృష్టించిందని, దాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లాలనుకోవడం మూర్ఖత్వమని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలే తప్ప పరిపాలనను కాదనే విషయాన్ని తాను ముందు నుంచీ చెబుతూనే వస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయపరమైన రాజధానిగా మార్చాలనుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని చెప్పారు.

జీఎన్ రావు కమిటీ రద్దుకు డిమాండ్..
మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య రాజధాని పరిసర గ్రామాలకు సంబంధించినది మాత్రమే కాదని, రాష్ట్ర సమస్యగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, ప్రభుత్వం వారిని రోడ్డెక్కలా చేసిందని విమర్శించారు.

అమరావతి రైతులు ఏం కావాలి..?
రాత్రికి రాత్రి అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామంటే ఇక్కడి రైతులు ఏం కావాలని చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులను అనాథలుగా మార్చేస్తారా? అని నిలదీశారు. రైతులను రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం సృష్టించిన సంపదను రాష్ట్రం మొత్తానికీ పంచేలా ప్రణాళికలను రూపొందించుకోవడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఉండలేమని ఆయన స్పష్టం చేశారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!












Click it and Unblock the Notifications