రూ.550కోట్లకు పైగా అక్రమాస్తులు: గొల్ల వెంకట రఘు సస్పెన్షన్
అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అమరావతి: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టైన ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు గొల్ల వెంకట రఘును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సెప్టెంబరు 26 నుంచి ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా రఘు స్టే పొందడాన్ని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రైబ్యునల్, హైకోర్టుల్లో కేవియట్ దాఖలు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం ప్రస్తుత సంచాలకుడిని ఆదేశించింది.

కాగా, సెప్టెంబరు 25న రఘు అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. సెప్టెంబర్ 26న అరెస్టు చేసి విశాఖపట్నం న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆ న్యాయమూర్తి అక్టోబరు 9 వరకూ రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసును వివరిస్తూ సస్పెండ్ చేయాలని ఏసీబీ శాఖ కోరగా ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఏసీబీకి చిక్కిన రఘు రూ.550కోట్లకుపైగా అక్రమాస్తులను కూడబెట్టిన విషయం తెలిసిందే.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications