AP Pensions:అవ్వాతాతలకు తీవ్ర నిరాశ..బ్యాంకుల్లో సర్వర్ డౌన్ బోర్డు..అందని పెన్షన్..!
ఏపీలో పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మే రెండవ తేదీ వచ్చినా పెన్షన్ అందక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయాల దగ్గర మహిళలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.మాకీ కష్టం ఎందుకురా భగవంతుడా అనే మహిళలు కూడా లేకపోలేదు.సాధారణంగా ఒకటవ తేదీకే వాలంటీర్లు ఇంటికొచ్చి తలపుతట్టి అర్హులైన వారికి పెన్షన్ అందజేసేవారు. అయితే గత నెల నుంచి పెన్షనర్లు తమకు పెన్షన్ అందుతుందో లేదో అన్న అయోమయానికి గురవుతున్నారు.
పింఛన్లకు బ్రేక్ కారణం అతనే
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లకు బ్రేక్ పడటంతో పాటు చాలా పథకాలు కూడా ఆగిపోయాయి. సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఇంటివద్దకు వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించకుండా ఈ కార్యక్రమంపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటివద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత నెల అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. అయితే మండుటెండలో వృద్ధులు పింఛన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు కూడా. ఇక మే నెలలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పింఛన్ అందలేదు. బ్యాంకులకు వెళ్లాలి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకులో అకౌంట్ లేదు. వారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

బ్యాంకుల వద్ద సర్వర్ డౌన్ బోర్డులు
ఇక బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న ఆశ వారిలో కనిపించింది. ఉదయం 11 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్నారు. చివరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్ కోసం వేచిఉన్న మహిళలు కలత చెందారు. ఆవేదనతో ఇంటిముఖం పట్టారు. బ్యాంకులో సర్వర్ పనిచేయడం లేదని రేపు రమ్మంటున్నారంటూ మహిళలు చెప్పారు. అయితే రేపు కూడా ఇస్తారో లేదో అన్న నమ్మకం తమకు లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
బ్యాంకులకు వెళ్లమంటే ఎట్లా వెళ్లేది నాకు ఖాతా కూడా లేదు..!!#Pensions #Pensioners #ApGovt #PensionDistribution #Oneindiatelugu pic.twitter.com/i9vcTLW9oE
— oneindiatelugu (@oneindiatelugu) May 2, 2024
పెన్షన్లు సకాలంలో అందకపోవడానికి కారణం టీడీపీ చంద్రబాబే అంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. వృద్ధులు ఏకంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న దృశ్యాలు బ్యాంకుల వద్ద కనిపించాయి. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు నిరాటంకంగా వచ్చిన పెన్షన్లు.. గత రెండు నెలల నుంచి ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.పేదవాళ్లకు ఈ పింఛన్ డబ్బులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్న అవ్వ తాతలు... జగన్ పై ప్రతిపక్షాలు కక్షగట్టాయంటూ వృద్ధులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications