టెట్ 2018 ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2018 ఫలితాలను మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్ కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు.
మొత్తంగా ప్రతి సబ్జెక్ట్ లోనూ 90కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 25శాతం మంది ఉన్నారన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. టెట్ ఫలితాలను సంబంధిత వైబ్ సైట్ (aptet.apcfss.in) లో పొందుపరిచారు.

ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సోమవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
విజయవాడలో టెట్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పారు. సుమారు 10 వేల ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అనుమతిని కోరుతూ ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే ఈ వారంలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications