Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలేది నేడే: రెండో జాబితా విడుదల

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

Another list of YSRCPs assembly constituencies incharges, likely out today

ఇప్పుడు తాజాగా రెండో జాబితా సిద్ధమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఇన్‌ఛార్జీల పేర్లతో కూడిన లిస్ట్ ఇది. ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పూర్తి చేసింది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు బలంగా ఉన్న జిల్లాలు ఇవి. ఈ రెండు జిల్లాల్లో జనసేన పార్టీ బల పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో- వీటిని ప్రతిష్ఠాత్మంగాతీసుకుంది వైఎస్ఆర్సీపీ.

ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుల సంఖ్య అధికంగా ఉంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది చొప్పున వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఈ రెండు జిల్లాల నుంచి ఎన్నికయ్యారు. ఈ సంఖ్యా బలాన్ని మరింత పెంచుకునే దిశగా పార్టీ అగ్రనాయకత్వం కసరత్తు పూర్తి చేసింది.

రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, మార్గాని భరత్‌ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మండపేట నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+