అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు, హైద్రాబాద్ కు గుడ్ బై
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైదరాబాద్:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుండి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైద్రాబాద్ లో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 3వ, తేది నుండి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Andhra Pradesh Assembly House At Amaravati
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను అమరావతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.శాసనసభకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక నుండి అమరావతిలోనిే నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.
హైద్రాబాద్ అసెంబ్లీలో ఇప్పటివరకు నాలుగు సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 25వ, తేదిలోపుగా ఎపి అసెంబ్లీ సిబ్బంది తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కోడెల.
గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని భావించినా వసతులు సక్రమంగా లేని కారణంగానే హైద్రాబాద్ లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.