గవర్నర్ ను కలిసి బీజేపీ నేతలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భారతీయ జనతాపార్టీ నాయకుడు మొగిరాల సురేష్ను పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ.. సురేష్ను తన రెండు కాళ్లతో బంధించి నొక్కడం వైరల్ గా మారింది.
తమ పార్టీ నాయకుడిపై డీఎస్పీ కర్కశంగా వ్యవహరించడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా స్పందించింది. డీజీపీ, జాతీయ బీసీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కావలిలో పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్ కు వివరించారు. డీఎస్పీని సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

గవర్నర్ను కలిసిన తర్వాత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని, బీసీలంటే సీఎం జగన్కు ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. వైసీపీ ఆధ్వర్యంలో బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నట్లు తెలిపారు. తమ పార్టీ నాయకుడు సురేష్ పై డీఎస్పీ దాడిచేయడం దారుణమని, ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ముందుగానే పోలీసుల అనుమతి కోరామని, అయినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు దర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ వచ్చేనెల 16, 17 తేదీల్లో కర్నూలులో బీసీ సామాజిక చైనత్య సదస్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications