పురందేశ్వరీ హఠావో.. ఏపీ బీజేపీకో బచావో: కమలం పార్టీలో కలకలం
ఏపీ బీజేపీలో విబేధాలు బయటపడ్డాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పనితీరును పలువురు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు. కమలం పార్టీలో ఉన్న టీడీపీ కోవర్టుగా ఆమెను అభివర్ణించారు.
రాష్ట్రంలో ఎంతో మంది బీజేపీ అధ్యక్షులతో కలిసి పనిచేశామని గుర్తు చేసిన ఏవీ సుబ్బారెడ్డి... పురందేశ్వరి లాంటి అధ్యక్షురాలను చూడలేదని మండిపడ్డారు. పురందేశ్వరి బీజేపీ కోసం పనిచేస్తున్నారో లేక టీడీపీ జెండాను మోస్తున్నారో బీజేపీ శ్రేణులకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పార్టీ బలోపేతం కోసం ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆరోపించారు. ఆమె సొంత ప్రయోజనాల కోసం బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి.

పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారు తప్పితే నిజంగా ఆమెకు పార్టీపై ఎలాంటి ప్రేమ లేదన్న ఏవీ సుబ్బారెడ్డి... బీజేపీని త్వరలోనే టీడీపీకి తాకట్టు పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ పదవి ఇస్తుందని తెలిస్తే ఆ పార్టీలోకి పురందేశ్వరి జంప్ అయిపోతారని సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీలో చేరాక ఇప్పటి వరకు ఆమె వల్ల ఒక్క ఓటు, లేదా ఒక్క సీటు అదనంగా రాలేదని గుర్తుచేసిన సుబ్బారెడ్డి, పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించి బంధుప్రీతిని చాటుకున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ కోసం పనిచేయడం మానేసి టీడీపీని కాపాడుకునే బాధ్యతను తన భుజంపై వేసుకున్నారు పురందేశ్వరంటూ ఏవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్టయితే టీడీపీ కార్యకర్తలకంటే ముందు ఆమె ఖండించిన మాట వాస్తవం కాదా అని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన చంద్రబాబును పురందేశ్వరి వెనుకేసుకురావటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించిన సుబ్బారెడ్డి.. టీడీపీ బలహీనపడుతున్న సమయంలో బీజేపీని ఏ రకంగా బలోపేతం చేయాలో ఆలోచన చేయడం మానేసి పురందేశ్వరి టీడీపీని ఎలా కాపాడుకోవాలో, అందుకోసం బీజేపీని ఎలా వాడుకోవాలో చర్చించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక స్కాం మద్యం స్కాం లాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి కాసేపు హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయిపోవడాన్ని పార్టీ కార్యకర్తల్లో అయోమయం నింపుతోందని అన్నారు. ఇసుక స్కామ్లో హడావుడి చేసి తర్వాత సైలైంట్ అవడంతో ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు పొందారా అన్న అనుమానంను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

మద్యం స్కాము అంటూ ఆరోపణలు చేసిన పురందేశ్వరి ఆ తర్వాత ఆ అంశాన్ని ఎందుకు గాలికొదిలేశారని బీజేపీలో కొందరు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మద్యం కంపెనీలతో పురందేశ్వరి కుటుంబ సభ్యులు బేరాలాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఏపీలో స్కాములు జరిగి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలను పురందేశ్వరి పార్టీలోని ఇతర నాయకులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక జిల్లాలో కూడా బీజేపీ పోస్టులను అధ్యక్షురాలి హోదాలో అమ్ముకున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 30శాతం పోస్టులు పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టడంతో బీజేపీ క్యాడర్లో ఒక్కింత అసంతృప్తి కనిపిస్తోంది. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆమె సొంత సామాజిక వర్గంవారిని కూడా పక్కనబెట్టి కొత్తవారిని తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో చాలామంది టీడీపీ నుంచి వచ్చినవారే కావడం విశేషం.

బీజేపీలో మునుపెన్నడూ కుల ప్రస్తావన లేదని పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాకే ఇవన్నీ తెరపైకి వచ్చాయని..దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పురందేశ్వరి పదవే పరమావధిగా భావిస్తారని అందువల్లే అన్ని పార్టీలు మారారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పదవులు కూడా దొడ్డిదారినే తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలోని ఇతర నాయకులంతా కలిసి ఢిల్లీలోని హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురందేశ్వరి హఠావో.. ఏపీ బీజేపీకో బచావో అనే నినాదాన్ని పార్టీలో బలంగా వినిపిస్తున్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications