ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-బడ్జెట్ సహా అసెంబ్లీలో పెట్టే బిల్లులకు ఆమోదం..!
ఏపీలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభలో పెట్టే పలు కీలక బిల్లులకు కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది.
అమరావతి : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం గవర్నర్ ప్రసంగం పూర్తయింది. ఆ తర్వాత భేటీ అయిన బీఏసీ.. ఈ నెల 24 వరకూ 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశమైంది.
ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే 20 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించే బిల్లుతో పాటు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపే చట్టసవరణ బిల్లు, కొత్త పారిశ్రామిక విధానానికి ఆమోదం, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు 6 వేల జీతం ఇచ్చేలా నైట్ వాచ్ మెన్ ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిర్ణయం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ కు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం వంటివి ఉన్నాయి.

అలాగే ఆలయాల పాలకమండళ్లలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటుచేసే అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి 11 మండలాల్లోని 120 గ్రామాలు,2 మున్సిపాలిటీలను తీసుకురానున్నారు. అలాగే మరికొన్ని కీలక బిల్లులు, నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటి ప్రకారం రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోనుంది. అనంతరం వీటిని మండలికి పంపి అక్కడా ఆమోదం తీసుకోవాల్సి ఉంది.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications