ఉద్యోగులకు ఐఆర్, రుణమాఫీ - సీఎం జగన్ వరాలు, ముహూర్తం ఖరారు..!?
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఏ ఒక్క అవకాశం లేకుండా చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం. ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్దుల మార్పుల పైన సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరింది. ఈ నెల 27 నుంచి జిల్లాల పర్యటనలకు సీఎం జగన్ నిర్ణయించారు. ఇక, ఎన్నికల వేళ వరాల ప్రకటన దిశగా ఈ నెల 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది.
కీలక మంత్రివర్గ భేటీ : ముఖ్యమంత్రి జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 27న భీమిలిలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటున్నారు. ఈ నెల 30న ఏలూరు కేంద్రంగా రెండో సభకు నిర్ణయించారు. ఈ నెల 31న పాలనా పరంగా కీలక నిర్ణయాల దిశగా మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు సిద్దం అవుతన్న వేళ ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..ఎన్నికల వరాలు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో, ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ఏపీ బడ్జెట్ కు తుది రూపు ఇవ్వనున్నారు.

ఎన్నికల వరాలు : ఈ సారి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నిర్వహణ పైన ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం అవసరం. ఈ లోగా ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి) ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వం చర్చలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇక, రైతులకు రుణమాఫీ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అధికర వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయటంతో..కొత్త హామీల విషయంలోనూ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్ణయాల పై ఆసక్తి : దీంతో..ఈ సారి మంత్రివర్గ సమావేశంలో రైతు రుణమాఫీ దిశగా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే విధంగా పార్టీ పరంగానూ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు సాధ్యాసాధ్యాల అమలు పైనా ప్రభుత్వం నివేదిక సేకరించింది. దీని పైన నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక, రాజకీయంగా మంత్రులకు సీఎం జగన్ కీలక దిశా నిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరిలో ప్రభుత్వం చేయూత, జగనన్న కాలనీల ప్రారంభం పైన నిర్ణయం తీసుకోన్నారు. ఎన్నికల వేళ నిర్వహిస్తున్న సమావేశం కావటంతో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications