నా గుండె బరువెక్కింది.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. తాజాగా అధికార లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు ముగిశాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్.. మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంత్య క్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు.
అయితే తాజాగా మురళీ నాయక్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్య చెప్పారు. ఈ క్రమంలో పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది. మంత్రి నారా లోకేశ్ కూడా మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల… pic.twitter.com/gsijcZYJx5
— N Chandrababu Naidu (@ncbn) May 11, 2025
ఇక మురళీ నాయక్ భౌతిక కాయం తరలించే సమయంలో రాష్ట్ర మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. జవాన్ కు నివాళిగా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని పూలతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్గా ఏర్పడి, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతికకాయాన్ని తరలించారు. దీంతో బెంగళూరు నుంచి కళ్లితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications