AP Rains : భారీవర్షాలపై జగన్ సమీక్ష-5 జిల్లాల కలెక్టర్లకు అలర్ట్-బాధితులకు సాయం ఎంతంటే..?
ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్ఫ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టర్లను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గోదావరితో పాటు ఇతర నదుల్లో వరద పరిస్దితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ప్రజలు వర్షాలు, వరదల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉందని, రేపు ఇది 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ఇన్ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందని, ఇది రేపటికి సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత తగ్గుతుందన్నారు.

కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలని సీఎం జగన్ ఆదేశించారు. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలన్నారు. ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పనిచేయాలని, దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలన్నారు. వారి పట్ల మానవతాధృక్పధంతో వ్యవహరించాలని, కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలన్నారు.

బాధితులకు సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలని, శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలన్నారు. సహాయ శిబిరాల నుంచి బాధితులను తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1000లు ఇవ్వాలని ఆదేశించారు. మరో ముఖ్యమైన అంశం కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉండాలని, ఉదారంగా వ్యవహించాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లనుంచి సహాయ శిబిరాలకు వచ్చినవారిని వారిని తిరిగి ఇళ్ళకు పంపించేటప్పుడు వారికి రూ.10వేల రూపాయలు ఇవ్వాలని, ఇది తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుందన్నారు. అలా చేయకపోతే వాళ్లు ఎక్కడికి పోవాలో తెలియదన్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications