మేం కరోనా నుంచి కోలుకున్నాం- డిశ్చార్జ్ ఎప్పుడంటే... ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..
కరోనా సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటూ వైరస్ బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషా క్రమంగా కోలుకుంటున్నారు. అల్లా దయతో తాను, తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఆయనతో పాటు కుటుంబసభ్యులు కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు.
'కరోనా వ్యాక్సిన్’ దొంగ: రష్యాపై యూకే, అమెరికా, కెనడా సంచలన ఆరోపణలు
ప్రస్తుతం తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో అంజాద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''చిత్తూరు కలెక్టర్, వైద్యుల సలహా మేరకు తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రి వైద్య బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్సపొందాం.
Recommended Video
నేను, నా సతీమణి ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం. కోవిడ్-19 టెస్ట్లు చేయటంలో, పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో, ఆహారం కల్పించే విషయంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది. ఏపీ వైద్య బృందానికి, కడప కోవిడ్ సెంటర్లో వైద్య సేలందిస్తున్న వైద్యబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.'' అని అన్నారు.