వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Big Breaking:అచ్చెన్నాయుడు అరెస్టు ,ఈఎస్ఐ స్కాంలో ఆధారాలు పక్కా..టీడీపీకి భారీ షాక్

|
Google Oneindia TeluguNews

టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలను తవ్వితీస్తున్న జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా వెళుతోంది. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఫైబర్ నెట్, రంజాన్ తోఫా చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయంచింది . ఇదే సమయంలో ఏపీలో జరిగిన ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కూడా ఫోకస్ చేసింది. అందులో భాగంగా నాడు టీడీపీ హయాంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆ తర్వాత కార్మిక మంత్రి అయిన పితాని సత్యనారాయణ ప్రమేయంపైనా ప్రభుత్వం లోతుగా విచారణ చేస్తోంది.

వైసీపీతో టచ్‌లో మాజీమంత్రి నారాయణ?: దర్యాప్తు ఎఫెక్ట్? నెల్లూరు సిటీ సీటుకు టీడీపీ కొత్త ఇన్‌ఛార్జివైసీపీతో టచ్‌లో మాజీమంత్రి నారాయణ?: దర్యాప్తు ఎఫెక్ట్? నెల్లూరు సిటీ సీటుకు టీడీపీ కొత్త ఇన్‌ఛార్జి

మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి

మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి

తెలంగాణలో దేవికారాణి వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై గత 10 రోజులుగా దర్యాప్తులో వేగం పుంజుకుంది. దాదాపు రూ.200 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే తాజాగా ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్లను ఏసీబీ విచారణ చేసింది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో పరికరాలు మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో గుర్తించారు.

అచ్చెన్నాయుడు ప్రమేయం

అచ్చెన్నాయుడు ప్రమేయం

ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రమేయంపైనే ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. రూ.38 కోట్లు విలువైన మందులను రూ. 90 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అవసరమైన పరికరాలు వాస్తవ ధరకంటే ఐదేళ్ల కాలంలో రూ.150 కోట్లు ఎక్కువగా వెచ్చించినట్లు అధికారులు నివేదికలో నిగ్గు తేల్చారు. ఈ మొత్తం వ్యవహారంపైన ప్రభుత్వం పెద్దలకు పూర్తి నివేదిక ఇచ్చారు. అందులో ప్రధానంగా అచ్చెన్నాయుడు పాత్ర పైన లోతుగా విచారణ చేసిన ఏసీబీ కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో కార్మిక శాఖలో పనిచేసిన ముఖ్య అధికారులతో పాటు అచ్చెన్నాయుడిని విచారణకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే టెక్కలిలో ఉన్న అచ్చెన్నాయుడిని విచారణ చేసి అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Acchennaidu Confirm YSRCP leaders joining TDP ఛాన్స్ మిస్ అవద్దు, అచ్చెన్న 'క్లూ' | Oneindia Telugu
దొరికిన ఆధారాలు

దొరికిన ఆధారాలు

తిరుపతిలోని ఒక డాక్టరును విచారణ చేసిన సమయంలో అచ్చెన్నాయుడి జోక్యంపై ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు. ఏసీబీ చేసిన విచారణలో నాటి మంత్రి పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే భారీ నిధులతో పరికరాలు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రోజున ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అచ్చెన్నాయుడు టార్గెట్‌గా ఏసీబీ వేస్తున్న అడుగుల్లో ఆయన చిక్కుకోవడం ఖాయమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రోజున ఏసీబీ ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది మరెంత మంది అధికారులు వలలో చిక్కుతారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

English summary
ESI Scam in AP has once again surfaced. ACB after thorough enquiry is all set to take the former labour minister Acchennaidu into custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X