ఏపీలో కరెంటు ఛార్జీలు తగ్గుతాయా ? ఈఆర్సీలో ట్రాన్స్ కో పిటిషన్ ..!
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్ప తగ్గింపు మాటే తెలియని వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పటివరకూ నష్టాల పేరుతో వినియోగదారులపై ప్రతీ నెలా ఏదో విధంగా ట్రూఅప్ ఛార్జీల భారం మోపుతూ వస్తున్న డిస్కంలు ఇప్పుడు ట్రూడౌన్ స్ధితికి చేరుకున్నాయి. దీంతో ఆ మేరకు తమ నష్టాలు తగ్గి లాభాల్లోకి వస్తామని అంచనా వేస్తున్న విద్యుత్ సంస్ధలు.. విద్యుత్ నియంత్రణ మండలికి కీలక ప్రతిపాదన చేశాయి. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రతీ ఏటా విద్యుత్ పంపిణీ సంస్ధలు తమకు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చు ఆధారంగా ఛార్జీల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలికి ముందస్తుగా ప్రతిపాదనలు ఇస్తాయి. ఆ ప్రతిపాదనలకు మించి వాస్తవ ఖర్చు అయితే అప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో వాటిని వసూలు చేసుకుంటుంటాయి. ఇలా గత కొన్నేళ్లుగా ట్రూఅప్ ఛార్జీల భారం వినియోగదారులపై తీవ్ర స్ధాయిలో ఉంటోంది. కానీ ఈఆర్సీకి ఇచ్చిన ప్రతిపాదనల కంటే తక్కువ ఖర్చు అయితే ట్రూడౌన్ అవుతుంది. అప్పుడు తమకు మిగిలిన డబ్బును తిరిగి వినియోగదారులకు డిస్కంలు సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదన ఇచ్చాయి.

రాష్ట్ర పరిధిలో మూడు విద్యుత్ పంపిణీ సంస్ధలు(డిస్కంలు) ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి గత ఐదేళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్య ట్రూ డౌన్ అయినట్లు అంటే వాస్తవ ఖర్చు ఈఆర్సీ అనుమతించిన దాని కంటే రూ.1059 కోట్లు తక్కువగా అయినట్లు డిస్కంలు తెలిపాయి. ఈ మేరకు ఈపీడీసీఎల్ రూ.383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.247.35 కోట్లు ట్రూడౌన్ అయినట్లు ఈఆర్సీకి తెలిపాయి. ఇలా మొత్తం రూ.1059 కోట్లను వినియోగదారులకు సర్దుబాటు చేసేందుకు అనుమతి కోరుతూ ట్రాన్స్ కో ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు కస్టమర్లకు బిల్లులు తగ్గబోతున్నాయి.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications