Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rapidoతో జత కట్టిన ఏపీ సర్కార్-దేశంలో తొలిసారి ఆ సేవలు..!

ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖ వాసులకు ప్రభుత్వం ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఈ మూడు నగరాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రముఖ క్యాబ్ ల సంస్థ ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీలో పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా 'డ్రైవర్-కం-గైడ్' విధానాన్ని ఏపీ పర్యాటక శాఖ ఆవిష్కరించింది. సీఎం చంద్రబాబునాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి, రాపిడో సహ-వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లిపాల్గొన్న కార్యక్రమంలో దీనిపై ప్రకటన చేశారు.

AP Government Partners with Rapido for India s First Driver-cum-Guide Service

ఏపీ ప్రభుత్వానికి, రాపిడోకు మధ్య ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ వెల్లడించింది. ఈ ఎంఓయూ ద్వారా రాపిడోలో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలు ప్రారంభించనుంది. రాపిడో యాప్‌లోనే టూరిస్ట్ ఆటోలు/క్యాబ్‌లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉంటాయి.

AP Government Partners with Rapido for India s First Driver-cum-Guide Service

విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక కో-బ్రాండెడ్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి పర్యాటక సేవలను సులభతరం చేయనుంది. దీనివల్ల క్యాబ్, ఆటో డ్రైవర్లకు ఆదాయం కూడా పెరుగుతుంది. టెక్నాలజీ సాయంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యాటక రవాణాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం కాగా, ప్రపంచవ్యాప్తంగా అరుదైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+