కూటమి పాలన పై ప్రజలు హ్యాపీయా - లోపం ఎక్కడ, గ్రౌండ్ రియాల్టీ..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. భారీ అంచనాలతో కూటమి కి ప్రభుత్వం అనూహ్య మెజార్టీ కట్టబెట్టారు. మూడు పార్టీల కూటమి ఆరు నెలల పాలనలో ఏం చేసింది. ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది. పథకాల పైన ఎలాంటి చర్చ జరుగుతోంది. లోపం ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉందా.. ఇలాంటి అంశాల పైన సీఎం చంద్రబాబు ఫోకస్ చేసారు. అసవరం మేర సరి దిద్దుకోవటానికి సిద్దమయ్యారు. ఇందు కోసం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉండేలా కొత్త కార్యాచరణ డిసైడ్ చేసారు.
పాలన ఎలా ఉంది
ముఖ్యమంత్రి చంద్రబాబు గత అనుభవాలతో కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజల అభిప్రాయం మేరకే పాలనలో మార్పులు - చేర్పులకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ప్రజల నుంచి నిరంతరం అభిప్రాయ సేకరణకు సిద్దమవుతున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా పథకాలు.. పాలన పైన ప్రజల నుంచి సూచనలు - సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏ అంశంపైనైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలతో సహా ఏ నిర్ణయం పైన అయినా సరే ప్రజాభిప్రాయం మేరకే ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. దీంతో, కూటమిలో నిర్ణయాలు జరిగినా ప్రజాభిప్రాయం మేరకే అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రజాభిప్రాయం మేరకే
ప్రధానంగా ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలంటే పథకాల లబ్ది దారులే ఓట్ బ్యాంక్ గా భావిస్తున్నారు. దీంతో, పథకాల లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం.. సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. లబ్ది దారులు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్కార్ మార్పులు చేర్పులు చేయనున్నారు. పథకాలతో పాటుగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న పాలనా పరమైన నిర్ణయాల పైనా ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక..నూతన మద్యం పాలసీ తో పాటుగా మద్యం అమ్మకాలపైనా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రజలతో నేరుగా మమేకం అయ్యే పౌర సేవల పైనా ఇదే విధానం అమలు చేయనున్నారు.
గత అనుభవాలతో
ప్రజలు నిత్యం వినియోగించుకునే రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి పలు కీలక శాఖల నుంచి అందుతున్న సేవల పైనా ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. వీటి పైన ప్రజలు ఇంకా ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు.. ఏ మార్పులు చేయాలనేది సూచనలు స్వీకరించనున్నారు. దీని ద్వారా అవసరమైన మార్పులు చేసి సేవల్లో నాణ్యత పెంచాలని భావిస్తున్నారు. నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరుతున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగం చేసినా..అధికారులు మెప్పు కోసం ఇచ్చిన సమాచారం తో నష్టం జరగటంతో ఈ సారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications