Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులకు రుణ మాఫీ .. ప్రభుత్వం కీలక ప్రకటన

రాజధాని రైతులకు భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న కూటమి.. అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పడిన రాజధాని రైతులకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భూములిచ్చిన రైతులకు అండగా నిలబడటంతో పాటు, వారి భూములను అభివృద్ధి చేసేలా కసరత్తు చేస్తుంది.

రాజధాన రైతులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అమరావతి నిర్మాణానికి తీసుకున్న భూమిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. బుధవారం రాజధానిలో పలు ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించిన మంత్రి నారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు ప్రభుత్వం తరఫు నుంచి కీలక హామీ ఇచ్చారు.

సీఎం చంద్రబాబు సూచనతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతు కుటుంబాలకు 1.5 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుల కౌలు పెంచేందుకు ముఖ్యమంత్రి ప్రాథమికంగా అంగీకరించాని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. " వడ్డమాను లో 1768 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించాం. ముగ్గురు రైతులు ల్యాండ్ పూలింగ్ కు సమ్మతిస్తూ ఫారం - 1 ఇచ్చారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పించాలని గ్రామస్తులు కోరారు. వడ్డమాను అభివృద్ధికి డీపీఆర్ తయారు చేసి పనులు చేపడతాం. గతంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన,ఇతర కారణాలతో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు పెట్టింది. ప్రస్తుతం అమరావతిలో రూ.55 వేల కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తిచేయాలని సీఎం చెప్పారు. మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తులో ఇక్కడే ఒలంపిక్స్ నిర్వహణ కూడా జరుగుతాయి. రైతులకు ఇచ్చే ప్లాట్ లలో ముందుగా రెండు వరుసల రోడ్లు నిర్మించి ఇస్తాం. గతంలో మాదిరిగానే కుటుంబానికి 1.5 లక్షల రుణమాఫీకి సీఎం అంగీకరించారు. సీఎం గారి నిర్ణయానికి రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు" అని అన్నారు.

AP Govt Announces 1 5 Lakh Loan Waiver for Farmers Giving Land Under Pooling Scheme Says Minister Narayana

అనంతరం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి అడ్డుపడిన జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పారు. జగన్ చేసిన అన్యాయంపై రైతులు నిరసన తెలిపారు. ఆర్థికపరమైన అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించి సీఎం చంద్రబాబు నిధులు తీసుకొచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా ఆయన కృషి చేస్తున్నారు. రాజధాని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలి" అని వైసీపీపై విమర్శలు చేశారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+