వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల సేవలో పథకం పేరుతో ఆర్దిక సాయం అందిస్తోంది. గత ఏడాది ఈ మేరకు నిధులు విడుదల చేసారు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి అర్హుల ఖరారు ప్రక్రియ పైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లబ్ది దారుల ఎంపిక పైన కసరత్తు కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్దిక సాయం అందించేందుకు సిద్దమైంది. గత ప్రభుత్వంలో మత్య్సకారులకు ఇచ్చే ఆర్దిక ప్రయోజనం పెంచి కూటమి ప్రభుత్వం మత్య్సకారుల సేవలో పేరు తో పథకం అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన మత్స్యకారులకు చేపల వేట నిషేధం సమయంలో ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను షురూ చేశారు. ప్రస్తుతం అర్హులైనవారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలను సేకరించి లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నారు. అనంతరం వారి అకౌంట్లలో ప్రభుత్వం నిధులు వేయనుంది.

వేట నిషేధ సమయంలో ఖాతాల్లో రూ 20 వేలు
కాగా, ప్రభుత్వం మత్స్యకారులకు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుందని తెలిపింది. జూన్14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమల్లోకి ఉండదనుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు సముద్రంలో చేపల వృద్ది జరుగుతూ ఉంటుంది. దీని వల్ల ప్రతీ ఏడాది ఈ సమయంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళితే బోటు రిజిస్ట్రేషన్ ఏడాది రద్దు చేస్తారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం వారికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించనుంది. త్వరలో ఈ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ప్రమాద బీమా అందిస్తోంది.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్ల గడువు పెంపు-పూర్తి వివరాలివే..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications