చంద్రబాబు డిమాండ్ కు ఓకే చెప్పిన జగన్.. ఈసారి వారికి ఫుల్ హ్యాపీ...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల పింఛన్లలో కోత విధించకుండా పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో వీరి పింఛన్లలో 50 శాతం కోత విధించారు. మిగిలిన మొత్తాన్ని కరోనా సంక్షోభం ముగిశాక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్లలో కోత విధించడం తగదని, వారికి మానవతా దృక్ఫథంతో పూర్తిగా చెల్లింపులుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్లను పూర్తిగా ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గతంలో ప్రకటించిన మేరకు 50 శాతం, 10శాతం కోతలు ఉంటాయని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, వేతనాలను పూర్తి స్ధాయిలో చెల్లించనున్నారు.
Recommended Video













Click it and Unblock the Notifications