Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పోస్టులు, 4 రోజులే గడువు - అర్హత, వేతనం, ఎంపిక ఇలా..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,146 మంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో సబ్జెక్టు టీచర్ల తో పాటుగా ఎస్జీటీలు ఉన్నారు. వారి వేతనాలను ఖరారు చేసింది. ఈ నెల 7వ తేదీ లోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం పైన నిర్ణయం తీసుకుంది. తాజాగా గైడ్ లైన్స్ ఖరారు చేసింది. సుదీర్ఘకాలం కిందట రెగ్యులర్‌ టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లు పనిచేసేవారు. తాత్కాలిక ప్రాతిపదికన వారిని తీసుకొని పారితోషికం చెల్లించే విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పేరుతో ఆ విధానాన్ని తిరిగి ఇప్పుడు ప్రవేశపెట్టారు.

AP govt issues guide lines for Academic instructors Engagement in Govt schools

ఇటీవల మెగా డీఎస్సీతో భారీఎత్తున టీచర్లను భర్తీ చేసినప్పటికీ.. ఇంకా ఖాళీలున్న చోట్ల ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. వీరి నియామకానికి అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వు లు జారీచేసింది. 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. అందులో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 892, ఎస్జీటీ 254 ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.12,500, ఎస్జీటీకి రూ.10 వేలు పారితోషికంగా చెల్లిస్తారు.

కాగా, అయిదు నెలల కాలం వీరు విధుల్లో ఉంటారు. ఇందుకోసం రూ.8.21 కోట్లను సమగ్రశిక్ష నిధులు కేటాయించారు. ఈనెల 8 నుంచి విధుల్లోకి వచ్చే ఇన్‌స్ట్రక్టర్లు మే 7వ తేదీ వరకు కొనసాగుతారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా టెర్మినేట్ అవుతారని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ 300, తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ 130 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్లను తీసుకోనున్నారు. మండల స్థాయిలో ఎంఈవో ఖాళీలపై ప్రకటన జారీచేస్తారు.

అర్హులైన అభ్యర్థులు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ రోజ (బుధవారం) నుంచి ఈ నెల 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆ తర్వాత ఆ జాబితాలను ఎంఈవోలు డీఈవో కార్యాలయాలకు పంపుతారు. వారి అకడమిక్‌, ప్రొఫెషనల్‌ అర్హత ఆధారంగా మెరిట్‌ జాబితా తయారు చేస్తారు. అకడమిక్‌కు 75 శాతం, ప్రొఫెషనల్‌ అర్హతకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు. కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియను ఈనెల 7లోగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు విధులకు హాజరు కావాలి. ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలని ఇన్‌స్ట్రక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+