అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా కార్యాచరణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వీటి పైన చర్చించి పరిష్కారం దిశగా కసరత్తు చేస్తోంది. కాగా, తాజాగా రైతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం వారికి తీపి కబురు అందించింది. నిర్మాణాల వేగవంతం పైనా నిర్ణయం తీసుకుంది.
భూ సమీకరణకు సహకరించిన ప్రతీ రైతుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీ నెరువేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా మని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. రాజధానితో పాటుగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. అదే విధంగా భూములు తీసుకునే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. వీటి విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసారు. గ్రామాల అభివృద్ధిపై గ్రామస్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ.. గ్రామాల్లో కోట్లాది రూపాయలతో తమ ప్రభుత్వం మౌలిక వసతుల పనులు చేపడుతోందని వెల్లడించారు.

గ్రామస్థులు ప్రస్తావించిన అంశాలతో పాటుగా కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో మంత్రి నారాయణ వివరిస్తున్నారు. ప్రస్తుతం 29 గ్రామాల రైతులకు ఇస్తున్న వార్షిక కౌలును తమకు పెంచి ఇవ్వాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని భూములిచ్చిన రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే రాజధానిపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్యాకేజీ పెంచాలని రైతులు మంత్రికి విన్నవించారు. వీటి పైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. అదే విధంగా గతంలో రైతులకు ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా పరిష్కరిస్తామని, 29 గ్రామాలతో పాటు సమానంగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
-
దేశంలోనే టాప్ లో ఏపీలో అన్నదాతల అప్పులు.. కేంద్రం లెక్క ఇదే! -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
పీఎస్సార్, కాంతిరాణా టాటాపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం- ఉత్తర్వులు..!! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం











Click it and Unblock the Notifications