కిలో ఉల్లి రూ.32కే.. ఇక నుంచి రైతు బజార్లలో పంపిణీ!

సామాన్యుడి వంటగదిలో ఉల్లిపాయ మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్కెట్లో కిలో ఉల్లి ధర కొండెక్కి కూర్చోవడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఉల్లిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చేలా బిగ్ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సలసల కాగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేస్తూ, ప్రభుత్వ రైతు బజార్ల ద్వారా అత్యంత చౌకగా రాయితీపై ఉల్లిపాయలను విక్రయించడానికి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రాష్ట్రంలోని రైతు బజార్లలో కేవలం రూ. 32 కే కిలో ఉల్లిపాయలను అందించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. అక్రమాలను, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు ఒక పక్కా ప్రణాళికను రూపొందించారు. రేషన్ బియ్యం పంపిణీ కోసం వాడుతున్న 'రైస్' (RICE) యాప్‌లోనే ప్రతి కుటుంబం తీసుకునే ఉల్లి వివరాలను నమోదు చేయనున్నారు. ప్రతీ కుటుంబానికి వారానికి రెండు కిలోల చొప్పున ఈ రాయితీ ఉల్లిని అందించనున్నారు. రాబోయే రెండు రోజుల్లోనే ఈ పంపిణీ ప్రక్రియ అందుబాటులోకి రానుంది.

AP Govt Offers Subsidized Onions at Rs 32 per Kg in Rythu Bazars Amid Soaring Retail Market Prices

ఆకాశాన్నంటుతున్న ధరలు.. మార్కెట్లో ఎందుకీ కొరత?

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. వారం రోజుల కిందట రూ. 50గా ఉన్న ఉల్లి ధర, ఒక్కసారిగా రూ. 80 మార్కును దాటేసింది. రెండు నెలల కిందట కేవలం రూ. 20 పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు మూడింతలు కావడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు ప్రాంతాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం మహారాష్ట్ర నుంచి మాత్రమే అరకొరగా సరుకు వస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో కిలో ఉల్లి రూ. 100కు చేరినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఉల్లి ధరల మంట.. రైతుకూ కన్నీళ్లే..! కిలో రూ. 60 దాటింది.. సామాన్యుడికి షాక్
ఉల్లి ధరల మంట.. రైతుకూ కన్నీళ్లే..! కిలో రూ. 60 దాటింది.. సామాన్యుడికి షాక్

ఢిల్లీకి వెళ్లి మరీ సాధించిన నాదెండ్ల మనోహర్!

ఉల్లి మంట నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం బఫర్ స్టాక్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా ఉల్లిపాయలను కేటాయించేందుకు అంగీకరించింది. కేంద్రం నుంచి వస్తున్న ఈ నిల్వలనే రైతు బజార్ల ద్వారా రూ. 32 చొప్పున ప్రజలకు అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 80 వరకు ఉన్న ఉల్లిని సగానికంటే తక్కువ ధరకు అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించనుంది.

ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్- డిస్కౌంట్ రేట్లకు ఉల్లి, పప్పు, పామాయిల్..!
ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్- డిస్కౌంట్ రేట్లకు ఉల్లి, పప్పు, పామాయిల్..!

కొత్త పంట వస్తేనే శాశ్వత పరిష్కారం!

మార్కెట్లో కేవలం ఉల్లి మాత్రమే కాదు.. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా ఘాటెక్కాయి. ప్రస్తుతం కేజీ వెల్లుల్లి రూ. 205, అల్లం రూ. 120కి చేరడంతో వంటింటి బడ్జెట్ తలకిందులవుతోంది. మరో 2 నుంచి 3 నెలల పాటు ఉల్లి కొరత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రైతుల నుంచి కొత్త పంట మార్కెట్‌కు వస్తేనే ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని, అంతవరకు ప్రభుత్వం అందిస్తున్న ఈ రాయితీ ఉల్లి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+