చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు(Chandrababu)కు వ్యతిరేకంగా గతంలో దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లపై విచారణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లయింది.
గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో కొందరికి అనుకూలంగా అప్పటి సీఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ ప్రమేయంతో మార్పులు చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుల దర్యాప్తు విజయవాడ ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. అయితే ఈ కేసు దర్యాప్తును ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఆళ్ల మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పాటు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కొవసాగుతున్న ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఇంకో పిటిషన్ కూడా వేశారు. వీటిపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు.. తోసిపుచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 3 పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ మూడు పిటిషన్ల వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక













Click it and Unblock the Notifications