ఏపీలో ఐఏఎస్ల బదిలీలు-కొత్త సీఎస్ ఆదిత్యనాథ్- నీలం, శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు
ఏపీలో ఇవాళ పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరు అధికారులకు కీలక స్దానాలు అప్పగించింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని డిసెంబర్ 31తో రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిటైరవుతున్న నీలంతో పాటు మరికొందరు సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు దక్కాయి.
నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ
ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్య నాథ్ దాస్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సీఎస్ నీలం సహని పదవీకాలం ఈ నెల 31 తో ముగుస్తుంది. వచ్చే నెల అంటే కొత్త ఏడాదిలో జనవరి 1నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా ఆదిత్యనాథ్ విధులు నిర్వహిస్తున్నారు ఆదిత్యనాథ్ దాస్... సీనియర్ ఐఏఎస్ గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు..

ఈ నెలాఖరుతో రిటైరవుతున్న నీలం సాహ్నీ సేవలు మరికొంతకాలం ఉపయోగించు కోవడానికి అమెను సీఎం ముఖ్య సలదారుగా కాబినెట్ హోదా తో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పటికే సీఎస్ పదవీకాలం రెండు సార్లు.పొడిగించారు...సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల్లో నీలం సాహ్నీ చాలా చురుగ్గా ఉన్నారు..సీఎం జగన్ దృష్టిలో సమర్ధ అధికారిని గా పేరు తెచ్చుకున్నారు.. అందుకే ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించారు జగన్.
నీలం సహనికి కాబినెట్ రాంక్ ఇస్తూ సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ గా.నియమించారు. క్యాబినెట్ హోదాలో ఆమె ఇక నుంచి పని చేస్తారు .

రాష్ట్రంలో మరికొందరు ఐఏస్ అధికారులను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో తెలంగాణ క్యాడర్ నుంచి తాజాగా ఏపీ క్యాడర్కు వచ్చిన శ్రీలక్ష్మికి పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే జలవనరులశాఖలో డిపార్ట్మెంట్ ఓఎస్టీగా శ్యామలరావును నియమించారు. ఆదిత్యనాథ్ దాస్ రిలీవ్ కాగానే ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తున్న బాధ్యతలు శ్యామలరావు చేపడతారు. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమించారు.ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ను సునీత కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications